న్యూఢిల్లీ, ఆగస్టు 18: మారుతి సుజుకీ సరికొత్త ఆల్టో కే10 మోడల్ను పరిచయం చేసింది. ఈ కారు రూ.3.99 లక్షల నుంచి రూ.5.83 లక్షల ధరల శ్రేణిలో లభించనున్నది. ఈ ధరలు ఢిల్లీ ఎక్స్షోరూంకు సంబంధించినవి. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ, సీఈవో హిసాచి తకౌచి మాట్లాడుతూ.. అన్ని సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు, ముఖ్యంగా ఎంట్రిలెవల్తోపాటు ఎస్యూవీ విభాగంలో మరిన్ని మోడళ్ళను పరిచయం చేయనున్నట్లు చెప్పా రు.
ముఖ్యంగా వినియోగదారుడు కోరుకుంటున్న విధంగా టెక్నాలజీ, పలు నూతన ఫీచర్స్తో మోడళ్ళను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 2000లో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఆల్టో.. ఇప్పటి వరకు 43.3 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. నెక్స్ జనరేషన్ కే-సిరీస్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ మోడల్ 24.9 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వనున్నది.