Maruti Ertiga | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి శుక్రవారం తన మల్టీ పర్పస్ వెహికల్ (ఎంపీవీ) ఎర్టిగా సేల్స్ పది లక్షల మైలురాయిని దాటాయని ప్రకటించింది. మల్టీ పర్పస్ వెహికల్ కాన్సెప్ట్ను రీడిఫైన్ చేయడంతోపాటు టెక్నాలజీ పరంగా అభివ్రుద్ధి చేసిందని, మరింత స్టైలిష్గా తీర్చి దిద్దిందని మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ ఓ ప్రకటనలో తెలిపారు. పట్టణ, గ్రామీణ మార్కెట్లలోనూ మారుతి ఎర్టిగా దూసుకెళ్తున్నదని తెలిపారు. ఎంపీవీ సెగ్మెంట్లో ‘ఎర్టిగా’ వాటా 37.5 శాతం అని తెలిపారు. ఎర్టిగా కార్లను దేశీయ మార్కెట్లో విక్రయంతోపాటు 80కి పైగా దేశాలకు ఎగుమతి చేసింది.
2012లో తొలుత ఎర్టిగాను మారుతి సుజుకి ఆవిష్కరించింది. 2018లో న్యూ వర్షన్ ఎర్టిగాను మార్కెట్లోకి తీసుకొచ్చింది. తిరిగి 2022లో న్యూ జనరేషన్ ఎర్టిగాను ఆవిష్కరించింది. న్యూ జనరేషన్ ఎర్టిగా కారు ధర రూ.8.69 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్తోపాటు మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో ఆవిష్కరించింది. ప్రస్తుతం సీఎన్జీ ట్రిమ్ వేరియంట్లో అందుబాటులో ఉంది.
ఆల్-న్యూ అడ్వాన్స్డ్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ విత్ పెడల్ షిఫ్టర్స్, హైబ్రీడ్ టెక్నాలజీతో వస్తున్నది. పెట్రోల్ వేరియంట్ ఎర్టిగా లీటర్ పెట్రోల్ పై 20.51 కి.మీ, కిలో సీఎన్జీ గ్యాస్ పై 26.11 కి.మీ దూరం మైలేజీ ఇస్తుంది. క్రూయిజ్ కంట్రోల్, ఆటో హెడ్ ల్యాంప్స్ విత్ ‘ఫాలో మీ హోం’ ఫంక్షనల్లీ, ఎస్-సీఎన్జీ వేరియంట్లలో సీఎన్జీ స్పెషిఫిక్ స్పీడో మీటర్ ఉంటాయి. డ్యుయల్ టోన్ ఇంటీరియర్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, థర్డ్ రో రీక్లైనర్ సీట్స్, 17.78 సీఎం స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సెకండ్ రో రూఫ్ మౌంటెడ్ ఏసీ, ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ తదితర ఫీచర్లు ఉంటాయి. 1462 సీసీ ఇంజిన్ 6000 ఆర్పీఎం వద్ద 75.8 కిలోవాట్ల విద్యుత్, 4400 ఆర్పీఎం వద్ద 136.8 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఈ ఇంజిన్ సిక్స్ గేర్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్తో రూపుదిద్దుకున్నది.