న్యూఢిల్లీ, డిసెంబర్ 6 : కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ.. 9,125 యూనిట్ల సియాజ్, బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్ఎల్ఆర్, గ్రాండ్ విటారాలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. వీటిలో ఫ్రంట్రో సీట్ బెల్ట్స్లో సాంకేతిక సమస్యలు గుర్తించిన సంస్థ వెంటనే వెనిక్కి పిలిపిస్తున్నది. నవంబర్ 2 నుంచి 28 మధ్యకాలంలో తయారైన ఈ మోడళ్లలో మాత్రమే సీట్ బెల్ట్కు సంబంధించిన సమస్యలు గుర్తించినట్లు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ముందు వరుసలో సీట్బెల్ట్ ఎత్తును అడ్జెట్ చేసే స్థలంలో లోపం ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు, దీంతో సీట్ బెల్ట్ విడిపోయే ప్రమాదం ఉన్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి మరమ్మత్తులు ఉచితంగా చేసి ఇవ్వనున్నారు. ఈ రీకాల్కు సంబంధించి ఆయా కార్ల యాజమానులకు కంపెనీ వర్గాలు సమాచారం అందించారు. మరోవైపు వెయ్యి అర్బన్ క్రూజర్ యూనిట్లను రీకాల్ చేస్తున్నట్టు టయోటా కిర్లోస్కర్ ప్రకటించింది.
52 వేల వరకు రాయితీ
వచ్చే నెల నుంచి ధరలను పెంచుతున్న మారుతి సుజుకీ..డిసెంబర్ నెలలో మాత్రం పలు ఎంపిక చేసిన మోడళ్ళపై రూ.52 వేల వరకు రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. వీటిలో స్విఫ్ట్, వ్యాగన్ఆర్, డిజైర్, ఆల్టో మోడళ్లు ఉన్నాయి. కానీ, మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్యూవీ మోడైళ్లెన బ్రెజ్జా, ఎర్టిగా మోడళ్ళపై మాత్రం ఎలాంటి రాయితీ ఇవ్వడం లేదు.