న్యూఢిల్లీ, అక్టోబర్ 21: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ.. ప్రత్యేక ఎస్యూవీ మాడల్ జిమ్నీపై లక్ష రూపాయల వరకు రాయితీని ఇస్తున్నట్టు ప్రకటించింది. జిమ్నీ ఎస్యూవీపై రూ.50 వేల వరకు రాయితీ ఇస్తున్న సంస్థ..ఎక్సేంజ్ లేదా లాయల్టీ బోనస్ కింద రూ.50 వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నది. ఈ ఆఫర్లు దేశవ్యాప్తంగా ఉన్న నెక్సా డీలర్ల వద్ద ఈ నెల చివరి వరకు మాత్రమే లభించనున్నదని తెలిపింది. ఈ ఆఫర్ మాన్యువల్, పెట్రోల్ రకం మాడళ్లకు వర్తించనున్నది. ప్రస్తుతం జెటా రకం రూ.12.74 లక్షల ప్రారంభ ధరతో లభించనున్నది.