న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ పలు మాడళ్లపై రాయితీని ప్రకటించింది. ప్రస్తుత నెలకుగాను బాలెనో, ఫ్రాంక్స్, జిమ్నీలతోపాటు ఇతర మాడళ్లపై రూ.1.5 లక్షల వరకు రాయితీకి విక్రయిస్తున్నది. వీటితోపాటు ఎక్స్ల్ఆర్, ఇగ్నిస్, గ్రాండ్ విటారా మిల్డ్ హైబ్రిడ్, టర్బో-పెట్రోల్ రకం ఫ్రాంక్స్పై ఈ రాయితీని ఇస్తున్నట్లు తెలిపింది. నూతన ఆర్థిక సంవత్సరం తొలి నెలలో ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయని పేర్కొంది. వీటిలో నగదు డిస్కౌంట్లు, ఎక్సేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ రూపంలో సంస్థ ఇస్తున్నది. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ఎక్స్ఎల్6, ఫ్లాగ్షిప్ ఇన్విక్టో ఎంపీవీ మాడళ్లకు ఈ రాయితీలు వర్తించవని పేర్కొంది.
మారుతి ఇగ్నీస్: ఇగ్నీస్ మాడల్ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే మీకు రూ.58 వేల వరకు తక్కువ ధరకే లభించనున్నది. వీటిలో నగదు రూపంలో రూ.40 వేలు తగ్గనుండగా, ఎక్సేంజ్ బోనస్ కింద రూ.15 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద మరో రూ.3 వేలు తక్కువకానున్నాయి.
బాలెనో: మార్కెట్లో ప్రజాదరణ పొందిన ప్రీమియం హ్యాచ్బ్యాక్ బాలెనోపై రూ.35 వేలు నగదు డిస్కౌంట్ లభించనుండగా, ఎక్సేంజ్ బోనస్ కింద రూ.15 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.3 వేలు లభించనున్నాయి.
సియాజ్: మల్టీపర్పస్ మాడలైన సియాజ్పై రూ.53 వేలు రాయితీ ఇస్తున్నది. వీటిలో రూ.25 వేలు ధరను తగ్గించనుండగా, ఎక్సేంజ్ బోనస్ కింద మరో రూ.25 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద మరో రూ.3వేలు డిస్కౌంటు
గ్రాండ్ విటారా: నగదు డిస్కౌంట్లు, ఎక్సేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లు కలుపుకొని రూ.84 వేల వరకు తగ్గిస్తున్నది.