Car Prices | న్యూఢిల్లీ, మార్చి 23: వాహన సంస్థలు మళ్లీ ధరలు పెంచబోతున్నాయి. కమోడిటీ ఉత్పత్తులు భగ్గుమనడం, డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడం, బీఎస్-6 నూతన మార్గదర్శకాలు అమలులోకి రానుండటంతో సంస్థలపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ధరలను పెంచుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ, హోండాఎంపిక చేసిన మాడల్ ధరను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఎంత ధరను పెంచుతున్న విషయాన్ని మారుతి వెల్లడించలేదు.
12 వేల వరకు పెరిగిన అమేజ్
ఎంట్రి లెవల్ కాంప్యాక్ట్ సెడాన్ అమేజ్ ధరను రూ.12 వేల వరకు పెంచుతున్నట్టు హోండా కార్స్ ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం అధికమవడం, ఉద్గార నిబంధనలు అమలు చేయడం వల్లనే ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.