Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. టైటాన్ కంపెనీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, టాటా స్టీల్ వంటి హెవీ వెయిట్స్ మద్దతుతో రెండు వరుస సెషన్ల నష్టాలకు మార్కెట్లు చెక్ పెట్టాయి. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 276 పాయింట్లు (0.42 శాతం) లాభంతో 65,931 పాయింట్ల వద్ద స్థిర పడింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 89 పాయింట్ల (0.45శాతం) లబ్ధితో 19,783 పాయింట్ల వద్ద ముగిసింది.
నిఫ్టీ-50 ఇండెక్స్లో ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అదానీ ఎంటర్ప్రైజెస్, హిందాల్కో, దివిస్ ల్యాబ్స్ 1-2.7 శాతం మధ్య లాభ పడ్డాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.14 శాతం, బీఎస్ఈ స్మాల్ క్యాప్ 0.20 శాతం లాభంతో ముగిశాయి. నిఫ్టీ మెడల్ ఇండెక్స్ 1.22 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.13 శాతం, నిఫ్టీ మీడియా 1.12 శాతం లాభ పడగా, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 0.35 శాతం నష్టంతో ముగిసింది.
బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్-30లో జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, రిలయన్స్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్ టెల్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లబ్ధితో ముగిశాయి. మరోవైపు ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, మారుతి సుజుకి, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ, టీసీఎస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, హెచ్యూఎల్ షేర్లు పతనం అయ్యాయి.
టాటా సన్స్ అనుబంధ టైటాన్ షేర్ 1.27 శాతం పుంజుకి రూ.3,388 వద్ద స్థిర పడింది. అంతర్గత ట్రేడింగ్లో మరో ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకిన టైటాన్ మూడు లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ సొంతం చేసుకున్నది.