Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోసెషన్లో నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 24,800 పాయింట్ల కంటే దిగువన ముగిసింది. సెన్సెక్స్ 296 పాయింట్లకుపైగా పతనమైంది. ట్రంప్ సుంకాల నేపథ్యంలో మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. ఆగస్టు ఒకటి నుంచి భారత్ నుంచి వచ్చే అన్ని వస్తువులపై 25శాతం సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనుగోలు, సైనిక ఆయుధాలను కొనుగోలు చేయడంపై ట్రంప్ సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ఉదయం మార్కెట్లు నష్టాల్లో మొదలయ్యాయి. ఏ దశలోనూ సూచీలు మళ్లీ కోలుకోలేదు.
ఉదయం 80,695.50 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైన సెన్సెక్స్.. ఇంట్రాడేలో 81,803.27 పాయింట్ల గరిష్టానికి చేరుకొని.. అత్యల్పంగా 80,695.15 పాయింట్లకు పడిపోయింది. చివరకు 296.28 పాయింట్లు నష్టపోయి.. 81,185.58 వద్ద ముగిసింది. నిఫ్టీ 86.70 పాయింట్లు తగ్గి.. 24,768.35 పాయింట్లు వద్ద కొనసాగుతున్నది. దాదాపు 1,490 షేర్లు లాభపడగా.. 2,365 షేర్లు పతనమయ్యాయి. హెచ్యూఎల్, జియో ఫైనాన్షియల్, ఎటర్నల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐటీసీ నిఫ్టీలో లాభాలను ఆర్జించాయి. అయితే, నష్టపోయిన వాటిలో అదానీ ఎంటర్ప్రైజెస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, సన్ ఫార్మా ఉన్నాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.7 శాతం తగ్గాయి. ఎఫ్ఎంసీజీ 1.4శాతం పెరగ్గా.. ఐటీ, మెటల్ 1.4 శాతం పెరగ్గా.. ఐటీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్యూ బ్యాంక్, ఫార్మా, రియాల్టీ, టెలికాం 0.5-1.8 శాతం వరకు పతనమయ్యాయి.