Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ-30లో టాప్-10 సంస్థల్లో ఏడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,40,863.66 కోట్లు పెరిగింది. ఐటీ దిగ్గజాలు టాటా కన్సల్టె్న్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్ సంస్థలు భారీగా లబ్ధి పొందాయి. గత వారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 730.93 పాయింట్లు లాభ పడింది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.67,477.33 కోట్లు పుంజుకుని రూ.15,97,946.44 కోట్లకు చేరుకున్నది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.36,746.21 కోట్ల లబ్ధితో రూ.7,72,023.49 కోట్ల వద్ద స్థిర పడింది.
భారతీ ఎయిర్ టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11,727.55 కోట్ల వృద్ధితో రూ.8,45,123.87 కోట్లకు చేరుకున్నది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.10,913.96 కోట్లు లాభ పడి రూ.8,36,115.19 కోట్ల వద్ద ముగిసింది. ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,569.73 కోట్లు పెరిగి రూ.6,28,399.10 కోట్ల వద్ద నిలిచింది. రిలయన్స్ ఎం-క్యాప్ రూ.5,311.4 కోట్లు పెరిగి రూ.20,00,076.41 కోట్లకు చేరుకుంది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ.117.48 కోట్లు వృద్ధి చెంది రూ.6,45,926.13 కోట్ల వద్ద నిలిచింది.
మరోవైపు భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.47,943.48 కోట్ల నష్టంతో రూ.6,69,058.26 కోట్ల వద్ద ముగిసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.13,064 కోట్ల పతనంతో రూ.12,43,441.53 కోట్ల వద్ద స్థిర పడింది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.10,486.42 కోట్లు కోల్పోయి రూ.7,25,080.10 కోట్ల వద్ద నిలిచింది. గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో రిలయన్స్ మొదటి స్థానంలో కొనసాగింది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, ఎల్ఐసీ, హిందూస్థాన్ యూనీ లివర్, ఐటీసీ నిలిచాయి.