Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,99,111.06 కోట్లు పెరిగింది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 542.3 పాయింట్లు (0.75 శాతం) వాటిల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.90,220.4 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకుని భారీగా లబ్ధి పొందింది. రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18,53,865.17 కోట్లకు చేరుకున్నది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎం-క్యాప్ రూ.52,672.04 కోట్లు పుంజుకుని రూ.14,20,333.97 కోట్ల వద్ద స్థిర పడింది.
ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,852.65 కోట్ల లబ్ధితో రూ.7,04,210.07 కోట్లకు చేరుకున్నది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.32,913.04 కోట్ల పెరుగుదలతో రూ.6,69,135.15 కోట్ల వద్ద నిలిచింది. భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ.16,452.93 కోట్లు లబ్ధి పొంది రూ.6,05,299.02 కోట్ల వద్ద ముగిసింది. మరోవైపు టాప్-10 సంస్థల్లో మిగతా ఐదు సంస్థలు రూ.76,098.67 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఐటీసీ, ఎస్బీఐ, ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టపోయాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.32,609.73 కోట్ల నష్టంతో రూ.12,44,825.67 కోట్లతో సరిపెట్టుకున్నది. హెచ్యూఎల్ ఎం-క్యాప్ రూ.17,633.68 కోట్లు కోల్పోయి రూ.5,98,029.72 కోట్ల వద్ద స్థిర పడింది. ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9,519.13 కోట్ల నష్టంతో రూ.5,24,563.68 కోట్ల వద్ద ముగిసింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.9,107.19 కోట్లు కోల్పోయి రూ.5,82,111.90 కోట్ల వద్ద స్థిర పడింది. ఎస్బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,228.94 కోట్ల నష్టంతో రూ.5,65,597.28 కోట్ల వద్ద ముగిసింది.
గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో మొదటి స్థానాన్ని రిలయన్స్ నిలదొక్కుకుంది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) నిలిచాయి.