Mark Zuckerberg : భవిష్యత్ టెక్నాలజీ ఏఐదేనని పలువురు నిపుణులు అంచనా వేస్తుండటంతో పాటు ఏఐ నిపుణులకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. జాబ్ మార్కెట్పై ఏఐ పెను ప్రభావం చూపుతోంది. ఏఐతో కొలువుల కోత తప్పదనే ఆందోళన రేకెత్తుతుండగా, న్యూ టెక్నాలజీపై పట్టు ఉన్న ప్రొఫెషనల్స్కు భారీ వేతన ప్యాకేజ్లతో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
మెటా వంటి దిగ్గజ టెక్ కంపెనీలు ఏఐ నైపుణ్యాలున్న టెకీలకు ఆకర్షణీయ జాబ్ ఆఫర్లు అందిస్తున్నాయి. మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ తన ప్రత్యర్ధి గూగుల్ నుంచి ఏఐ రీసెర్చర్లను రిక్రూట్ చేసుకునేందుకు కసరత్తు సాగిస్తున్నారని లేటెస్ట్ రిపోర్ట్ వెల్లడించింది. గూగుల్ డీప్మైండ్కు చెందిన రీసెర్చర్లను రిక్రూట్ చేసుకునేందుకు జుకర్బర్గ్ నేరుగా వారికి వ్యక్తిగతంగా మెసేజ్ చేశారని ఈ రిపోర్ట్ తెలిపింది.
ఈ వ్యవహారానికి సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ వివరాలు వెల్లడించారని పేర్కొంది. మెటాకు ఏఐ ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో ఈమెయిల్లో జుకర్బర్గ్ వారికి వివరించారని తెలిపింది. మెటాతో వారి అనుబంధం అవసరమని జుకర్బర్గ్ ఏఐ రీసెర్చర్లతో పేర్కొన్నారని సమాచారం. ఇంటర్వ్యూలు నిర్వహించకుండానే ఆయా అభ్యర్ధులకు మెటా జాబ్ ఆఫర్లు అందిస్తోందని చెబుతున్నారు. వేతన సంప్రదింపులపై పట్టువిడుపులు ప్రదర్శిస్తూ ఏఐ రీసెర్చర్లకు అధిక వేతనాలను ఆఫర్ చేస్తోంది.
Read More :