Flipkart | ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సంస్థలు నిత్యం కస్టమర్లను ఆకట్టుకోవడానికి పండుగలు, ఉత్సవాల సందర్భంగా ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. తాజాగా రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ ఆఫర్లను సద్వినియోగం చేసుకుందాం అనుకున్న ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది.సౌరో ముఖర్జీ అనే వ్యక్తి రూ.1.13 లక్షల విలువ గల అసుస్ బ్రాండ్ న్యూ లాప్టాప్ కోసం ఆర్డర్ చేశాడు. కానీ, డెలివరీ అయిన తర్వాత ఆశ్చర్యపోవడం ఓపెన్ చేసినప్పుడు సౌరో ముఖర్జీతోపాటు డెలివరీ బాయ్ వంతైంది.
ఆర్డర్ చేసిన అసుస్ న్యూ బ్రాండ్ లాప్టాప్ ఇవ్వకపోగా, వాడిన లాప్టాప్ డెలివరీ చేయడంతో సౌరో ముఖర్జీ షాక్ అయ్యాడు. ఈ అంశాన్ని ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’లో షేర్ చేశాడు. ఇది వైరల్ కావడంతో ఫ్లిప్కార్ట్ సపోర్ట్ టీం స్పందించింది. సదరు యూజర్ ఆర్డర్ వివరాలు తెలియజేస్తే సహాయం చేస్తామని పేర్కొంది.
ప్రస్తుతం ఫ్రాడ్ జరుగుతున్న నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ డెలివరీ బాయ్ సమక్షంలోనే సౌరో ముఖర్జీ తనకు వచ్చిన డెలివరీ ప్యాక్ తెరిచి చూస్తే అప్పటికే వాడిన లాప్టాప్, దుమ్ము కొట్టుకుపోయి ఉన్న లాప్ టాప్ పంపారు. బ్లాక్ కలర్ లాప్టాప్ ఆర్డర్ చేస్తే సిల్వర్ కలర్ వచ్చింది. దీనిపై ‘ఎక్స్’లో స్పందిస్తూ ‘రిపబ్లిక్ డే సేల్ ఆఫర్ సందర్భంగా ఫ్లిప్కార్ట్లో నేను న్యూ అసుస్ బ్రాండ్ లాప్ టాప్ ఆర్డర్ చేశారు. కానీ నాకు పాతది వాడిన లాప్ టాప్ పంపారు. ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్లో ఆర్డర్ పై విక్రయించే ఉత్పత్తులను ఎప్పటికి నమ్మొద్దు’ అని క్యాప్షన్ పెట్టాడు.