ఈ నెల 13న ప్రారంభిస్తున్న సంస్థ
హైదరాబాద్, జనవరి 4: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్.. నూతన సంవత్సరం తొలి నెలలోనే ఏకంగా 22 షోరూంలను ఆరంభించబోతున్నట్టు ప్రకటించింది. వీటిలో 10 దేశీయంగా, మిగతా 12 విదేశాల్లో ప్రారంభించబోతున్నది. ఈ నెల 13న సిద్దిపేటలో తమ షోరూంను ప్రారంభిస్తున్నట్టు మలబార్ గ్రూపు చైర్మన్ ఎంపీ అహమ్మద్ ప్రకటించారు. దేశంలో బెంగళూరు, షోలాపూర్, తిరుప్పూర్, వారణాసి, రాయ్పూర్, పుణె తదితర నగరాల్లో.. అంతర్జాతీయంగా మలేషియా, ఖతార్, మస్కట్, షార్జాల్లో షోరూంలను తెస్తున్నామన్నారు. ఇందుకోసం రూ.800 కోట్ల మేర పెట్టుబడులు పెడుతున్నట్టు తెలిపారు. దీంతో సుమారు 5 వేల మందికిపైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.