ముంబై, సెప్టెంబర్ 1: కొవిడ్ పరిస్థితులు తొలగిన అనంతరం వారానికి ఒక్క రోజైనా ఇంటి నుంచి పనిచేయాలని మెజారిటీ కార్పొరేట్ ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఇండియాలో ఉద్యోగుల ప్రాధాన్యతలపై జేఎల్ఎల్ నిర్వహించిన సర్వేలో 79 శాతం ఉద్యోగులు ఈ అభిలాషను వ్యక్తంచేసారు. వివిధ కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్న 300 మంది ఉద్యోగుల అభిప్రాయాల్ని సర్వే వెల్లడించింది. కొవిడ్ తదనంతరం రెండు రోజులు వర్క్ ఫ్రం ఆఫీస్, మూడు రోజులు వర్క్ ఫ్రం హోం అమలు చేస్తే బావుంటుందని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 75 శాతం ఉద్యోగులు వారానికి ఒక్కరోజైనా ఆఫీసు నుంచి పనిచేయాలని కోరుకుంటున్నారు. 21 శాతం మంది భవిష్యత్తులో ఇంటి నుంచి పనిచేసే ఉద్దేశం లేదన్నారు.