న్యూఢిల్లీ : భారత్లో లాంఛ్ చేయనున్న సెవెన్ సీటర్ ఎక్స్యూవీ700 నుంచి మరో టీజర్ను మహీంద్ర లాంఛ్ చేసింది. వీకెండ్ టీజర్స్తో తన రాబోయే ఎస్యూవీపై అంచనాలు పెంచేస్తున్న మహీంద్ర తాజా టీజర్లో వాహన ఫీచర్లపై పలు సంకేతాలు వెల్లడించింది. ఎల్ఈడీ హెడ్లైట్స్, సీ ఆకారంలో ఎల్ఈడీ డీఆర్ఎల్లు, యారో హెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్పై టీజర్లో ఫోకస్ పెట్టింది.
ఇప్పటివరకూ వీకెండ్స్లో విడుదల చేసిన పలు టీజర్లలో వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఎస్యూవీ ప్రత్యేకతలను చూస్తే ఎయిర్ ప్యూరిఫైయర్ సిస్టమ్, పనోరమిక్ సన్ రూఫ్, ప్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, ఆటోబూస్టర్ హెడ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు వెల్లడయ్యాయి. అత్యాధునిక ఫీచర్లతో సిద్ధమవుతున్న ఈ వాహనం ఆగస్ట్ 15న లాంఛ్ కానుంది. ఇక అక్టోబర్ 2న మహీంద్రా ఎక్స్యూవీ 700 ఇండియా లాంఛ్ ఉంటుందని భావిస్తున్నారు.