న్యూఢిల్లీ : మహీంద్ర ఎక్స్యూవీ700 బుకింగ్స్ గురువారం ప్రారంభమైన గంటలోనే 25,000 ప్రీ బుకింగ్స్ నమోదయ్యాయి. భారత్లో ఈ మైలురాయిని చేరుకున్న తొలి ఫోర్ వీలర్గా మహీంద్ర ఎక్స్యూవీ700 నిలిచింది.
పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో న్యూ మహీంద్రా ఎక్స్యూవీ700ను మహీంద్ర రూ 11.99 లక్షల (ఎక్స్షోరూం, భారత్) ప్రారంభ ధరతో లాంఛ్ చేసిందని కంపెనీ ఆటోమోటివ్ డివిజన్ సీఈఓ విజయ్ నక్రా తెలిపారు. గురువారం ఉదయం పది గంటలకు బుకింగ్స్ ఓపెన్ చేయగా కేవలం 57 నిమిషాల్లోనే 25,000 ఎక్స్యూవీ700 బుకింగ్స్ నమోదవడం తమను ఆశ్చర్యానికి లోను చేసిందని చెప్పారు.