న్యూఢిల్లీ : వచ్చే నెలలో లాంఛ్ కానున్న మహీంద్రా ఎక్స్యూవీ వేరియంట్ల ధరల వివరాలు ఇంటర్నెట్లో బహిర్గతమయ్యాయి. మహీంద్రా ఎక్స్యూవీ700 ఫైవ్, సెవెన్ సీటర్ కాన్ఫిగరేషన్స్తో అందుబాటులోకి రానుంది. సెవెన్ సీటర్ ప్రారంభ ధర రూ 13.19 లక్షల నుంచి రూ 20.69 లక్షల మధ్య ఉంటుందని అనధికార సమాచారం.
ఇక మహీంద్రా ఎక్స్యూవీ700 బేస్ వేరియంట్ ధర రూ 11.99 లక్షల నుంచి రూ 19.49 లక్షల మధ్య ఉండనుంది. మహీంద్రా ఎక్స్యూవీ700 భారత్లో హ్యుండాయ్ అల్కాజర్ , టాటా సఫారీ, ఎంజీ హెక్టార్ ప్లస్ వంటి ఎస్యూవీలకు పోటీగా ముందుకురానుంది. అయితే లీకైన ధరలు ఎంతమేరకు వాస్తవమనేది తేలాలంటే కంపెనీ మరికొద్ది రోజుల్లో ధరల వివరాలను అధికారికంగా ప్రకటించే వరకూ వేచిచూడాలి.