ముంబై: ఈ నెలలో వారం రోజులు నో ప్రొడక్షన్ డేస్
పాటిస్తున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ( Mahindra ) ఆటోమోటివ్ డివిజన్ గురువారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో కోవిడ్-19 లాక్డౌన్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మున్ముందు సెమీ కండక్టర్లు, చిప్ల కొరత కొనసాగుతుందని మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించింది.
ఈ నేపథ్యంలో ఈ నెలలో 20-25 శాతం ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించినట్లు గురువారం బీఎస్ఈ ఫైలింగ్లో తెలిపింది. వెహికల్స్ ఉత్పత్తి తగ్గిపోవడంతో రెవెన్యూ, లాభాలు పడిపోతాయి. మరోవైపు పలు రకాల ఆదా చర్యలు చేపట్టడం ద్వారా నష్ట నివారణకు పూనుకున్నది.
అయితే ఎక్స్యూవీ 700 మోడల్ కారు ఉత్పత్తిపై ఎటువంటి ప్రభావం ఉండదని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. దాని ఆవిష్కరణ తేది, బుకింగ్స్ తేదీలో ఎటువంటి మార్పు లేదని వెల్లడించింది. మహీంద్రా అండ్ మహీంద్రా.. ట్రాక్టర్ల నుంచి ట్రక్కుల వరకు, బస్సులు, త్రీ వీలర్స్ ఉత్పత్తిపై ఎటువంటి ప్రభావం లేదు.