కోల్కతా, మార్చి 11: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా మరో మూడు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి సిద్ధమైంది. దేశీయంగా యూవీ, ఎస్యూవీ ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నది. ఎప్పడిలోగా విడుదల చేసేదానిపై స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. వచ్చే ఏడాది తొలి మూడు నెలల్లో ఒక మాడల్ను విడుదల చేసే అవకాశం ఉన్నదని పేర్కొంది. ప్రస్తుతం సంస్థ ఎక్స్యూవీ 400 మాడల్ ఈవీని మాత్రమే విక్రయిస్తున్నది. నూతనంగా విడుదల చేయనున్న వాహనాల్లో యుటిలిటీ వాహనం, ఎస్యూవీ ఉంటాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.