Reliance | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో టాప్-10 కంపెనీల్లో ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.51 లక్షల కోట్లు పెరిగింది. వీటిల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) భారీగా లబ్ధి పొందింది. గతవారం ట్రేడింగ్లో బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 1,444.59 పాయింట్లు (2.52 శాతం) లాభాలతో ముగిసింది. మార్కెట్ లీడర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మాత్రమే హరించుకుపోయింది.
టీసీఎస్ ఎం-క్యాప్ రూ.46,016.2 కోట్లు పెరిగి రూ.14,11,058.63 కోట్లకు చేరింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 33,861.41 కోట్ల లాభంతో రూ. 8,44,922.53 కోట్ల వద్ద స్థిరపడింది. బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ. 17,226.59 కోట్లతో రూ. 4,31,926.08 కోట్లకు దూసుకెళ్లింది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 16,601.55 కోట్లు పెరిగి రూ. 5,59,009.41 కోట్ల నిలిచింది.
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.6,113.36 కోట్లు పెరిగి రూ. 4,73,182.90 కోట్లకు చేరుకున్నది. ఇక ఎఫ్ఎంసీజీ మేజర్ హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 5,850.48 కోట్లతో రూ.5,42,262.17 కోట్లకు దూసుకెళ్లింది. భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ. 2,361.57 కోట్లు పెరిగి రూ. 3,95,535.80 కోట్ల వద్ద స్థిర పడింది.
వీటికి భిన్నంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ నష్టపోయాయి. రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,396.57 కోట్లు పతనమై రూ.15,77,383.90 కోట్ల వద్ద స్థిర పడింది. హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.2,870.45 కోట్లు నష్టపోయి రూ. 4,53,231.97 కోట్ల వద్ద ముగిసింది. టాప్ 10 కంపెనీల్లో రిలయన్స్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్యూఎల్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్ నిలిచాయి.