M-Cap rise Top-8 | గతవారం దేశీయ స్టాక్మార్కెట్లలో టాప్-10 సంస్థల్లో ఎనిమిది సంస్థలు రూ.1,60,408.24 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకున్నాయి. ఈక్విటీలు బుల్లిష్గా ఉండటంతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ భారీగా పెరిగింది. కానీ బజాజ్ ఫిన్కార్ప్, ఎస్బీఐ మార్కెట్క్యాపిటలైజేషన్ నష్టపోయాయి.
గతవారం బీఎస్ఈ-30 ఇండెక్స్ 1,159.57 పాయింట్లు పెరిగింది. శుక్రవారం సెన్సెక్స్ 55,487.79 పాయింట్లతో లైఫ్టైం రికార్డు నెలకొల్పింది. 55 వేల మార్కును దాటిన తర్వాత ఇదే తొలి రికార్డు. అత్యధికంగా టీసీఎస్ లబ్ధి పొందింది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.56,133.1 కోట్లు పెరిగి రూ.12,80,574.59 కోట్లకు దూసుకెళ్లింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.35,310.7 కోట్లు పెరిగి రూ.13,59,652.06 కోట్లకు చేరుకున్నది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.23,521.63 కోట్లతో రూ.7,26,419.85 కోట్లకు పెరిగింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.17,370.86 కోట్లు పెంచుకోవడంతో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,43,703.53 కోట్ల వద్ద స్థిర పడింది.
హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.13,304.96 కోట్లతో రూ.4,88,217.12 కోట్లకు పెంచుకున్నది. ఇక హిందూస్థాన్ యూనీ లివర్ రూ.7,671.41 కోట్లతో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,64,782.42 కోట్ల వద్ద స్థిరపడింది. ఐసీఐసీఐ బ్యాంక్ విలువ రూ.5,321.09 కోట్లతో దాని ఎం-క్యాప్ రూ.4,88,352.01 కోట్లు, కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎంక్యాప్ రూ.1774.49 కోట్లతో రూ.3,54,482.60 కోట్లకు పెరిగిపోయింది.
మరోవైపు బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ.4,288.54 కోట్లు తగ్గి రూ.3,71.340.29కోట్లకు, ఎస్బీఐ ఎంక్యాప్ రూ.3,837.58 కోట్లు పడిపోయి రూ.3,84,963.12 కోట్లకు చేరుకుంది. అత్యంత విలువైన సంస్థల్లో రిలయన్స్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీలివర్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ నిలిచాయి.