కాంట్రాక్టు దక్కించుకున్న డ్రీమ్ఫోక్స్
ముంబై, మార్చి 31: స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి సిద్ధమవుతున్న డ్రీమ్ఫోక్స్ సంస్థ ఐదు రైల్వే స్టేషన్లలో లాంజ్ సర్వీసులు అందించే కాంట్రాక్ట్ దక్కించుకున్నది. న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ఎర్నాకులం, మదురై రైల్వే స్టేషన్లు ఉన్నాయి. మరోవైపు, రూ.1,000-1,200 కోట్ల ఐపీవో కోసం స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ అనుమతి కోసం వేచి చూస్తున్న సంస్థ..ఇప్పటికే 51 విమానాశ్రయాల్లో లాంజ్ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఐదు రైల్వే స్టేషన్లలో లాంజ్ సేవలు ఎంత తొందర వీలైతే అంత తొందరగా ప్రారంభించాలనుకుంటున్నట్లు కంపెనీ ఫౌండర్, చైర్పర్సన్, ఎండీ లిబెరాథా పీటర్ కల్లట్ తెలిపారు.
కంపెనీ వ్యాపార విస్తరణలో భాగంగా రైల్వే స్టేషన్లలో లాంజ్ సేవలు ఆరంభిస్తున్నట్లు, కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి సంస్థ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని ఆమె చెప్పారు. ఇటీవల సంస్థ శ్రీనగర్, వైజాగ్లతోపాటు అమెరికా, స్కాట్లాండ్లలో డ్రీమ్ఫోక్స్ లాంజ్ సేవలు ఆరంభించింది. వచ్చే నాలుగేండ్లలో కేంద్ర ప్రభుత్వం మరో 25 విమానాశ్రయాలు నిర్మించాలనుకుంటుండటంతో లాంజ్ సేవలకు డిమాండ్ ఉంటుందన్న అంచనాతో వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు ఆమె చెప్పారు.