LIC | న్యూఢిల్లీ, మార్చి 29: ప్రభుత్వరంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) కార్యాలయాలు ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉండనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రోజులు కావడంతో ప్రభుత్వ లావాదేవీలు, ఇతరత్రా చెల్లింపులకు, పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్న ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా ఎల్ఐసీ ఈ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే ఆదివారం బ్యాంకులు పనిచేస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలో ఐఆర్డీఏఐ సూచన మేరకు పాలసీదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు తమ కార్యాలయాలను శని, ఆదివారాల్లో తెరుస్తామని ఎల్ఐసీ ఒక ప్రకటనలో వెల్లడించింది.