హైదరాబాద్, జూన్ 14: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ.. మంగళవారం ‘ధన్ సంచయ్’ పేరుతో ఓ కొత్త ప్లాన్ను పరిచయం చేసింది. ఇది నాన్ లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. భద్రత, పొదుపు ప్రయోజనాలతో దీన్ని సంస్థ తీసుకొచ్చింది. కచ్ఛితమైన ఆదాయ, టర్మినల్ లాభాలూ ఉన్నాయి. ఇక కనీసం ఐదేండ్లు, గరిష్ఠంగా 15 ఏండ్లు ఈ ప్లాన్ కాలపరిమితి ఉంటుంది. బీమా పొందిన వ్యక్తి మరణిస్తే.. వారి కుటుంబానికి ఆర్థికంగా కూడా ఈ ప్లాన్ బాసటగా నిలుస్తుంది. ఈ ప్లాన్ కింద మినిమం సమ్ అష్యూర్డ్ రూ.2.5 లక్షల నుంచి 22 లక్షల వరకున్నది. ప్రీమియం విషయంలో పరిమితి అంటూ ఏమీలేదు. మూడేండ్లు నిండితే చాలు వారి పేరుతో పాలసీ తీసుకోవచ్చు. పాలసీపై రుణ సదుపాయాన్ని కూడా పొందవచ్చు. ఆఫ్లైన్, ఆన్లైన్లలో ఈ ప్లాన్ను కొనే వీలున్నది.