ముంబై, జనవరి 13: ఇక విద్యుత్తో నడిచే వాహనాలు కూడా అద్దెకు లభించనున్నాయి. మహీంద్రా ఫైనాన్స్ అనుబంధ సంస్థయైన క్విక్లీజ్..వినియోగదారులకు లీజింగ్, సబ్స్క్రిప్షన్ పద్దతిన వాహనాలను అందిస్తున్నది. గతేడాది నవంబర్లోనే సంస్థ ఈ సేవలను ఆరంభించింది కూడా. ఈ ప్రొగ్రాం కింద నెలవారి సబ్స్క్రిప్షన్ కింద ఎలక్ట్రిక్ 4డబ్ల్యూ ఫీజు రూ.21,399, ఎలక్ట్రిక్ 3డబ్ల్యూ ఫీజు రూ.13,549గా నిర్ణయించింది. ఈ ఫీజులో బీమా, మెంటనెన్స్, రోడ్సైడ్ అసిస్టేన్స్ కలిపి వసూలు చేయనున్నది. ప్రస్తుతం ఈ ప్లాట్ఫామ్ కింద మహీంద్రా, టాటా మోటర్స్, మెర్సిడెజ్ బెంజ్, ఎంజీ మోటర్స్, ఆడీ, జేఎల్ఆర్లకు చెందిన పలు ఈవీ మోడళ్ళు ఉన్నాయి.