న్యూఢిల్లీ, డిసెంబర్ 28: దేశంలోని 7 ప్రధాన నగరాల ఆఫీస్ ప్రాపర్టీ మార్కెట్లో నికర లీజింగ్ ఈ ఏడాది మూడేండ్ల గరిష్ఠాన్ని తాకింది. హైదరాబాద్సహా టాప్-7 భారతీయ నగరాల్లో ఆఫీస్ ప్రాపర్టీ మార్కెట్ తీరుతెన్నులపై ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ ఓ నివేదికను రూపొందించింది. ఈ తాజా రిపోర్టు ప్రకారం ఈ ఏడాది హైదరాబాద్, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, చెన్నై, కోల్కతా, పుణె నగరాల్లో నికర లీజింగ్ 38.25 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. అలాగే 2015-2019 మధ్య ఐదేండ్ల సగటును సైతం ఈ ఏడాది జరిగిన నికర లీజింగ్ దాటేసింది. 3.1 శాతంగా ఉన్నది. గడిచిన పదేండ్లలో 2019 తర్వాత 2022లోనే ఈ స్థాయిలో నమోదు కావడం విశేషం. కరోనా ప్రభావం నుంచి మార్కెట్ కోలుకుంటున్నదనడానికి ఇదో నిదర్శనమని నివేదిక పేర్కొన్నది.
క్యూ4లో జోరు
ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఢిల్లీ-ఎన్సీఆర్ తర్వాత అత్యధికంగా ఆఫీస్ స్పేస్ నికర లీజింగ్ జరిగింది హైదరాబాద్లోనే. చెన్నై మూడో స్థానంలో ఉన్నది. మొత్తం ఏడు నగరాల ఆఫీస్ స్పేస్ లీజింగ్లో ఈ మూడు నగరాల వాటానే 60.9 శాతంగా ఉన్నది. ఢిల్లీ 23.7 శాతంగా ఉండగా, హైదరాబాద్, చెన్నైల్లో 37.2 శాతం లీజింగ్ జరిగింది. కాగా, ముంబై, బెంగళూరు నగరాలు ఈ చివరి త్రైమాసికంలో వెనుకబడ్డాయని కూడా తమ తాజా రిపోర్టులో జేఎల్ఎల్ చెప్పింది. మొత్తంగా టెక్నాలజీ సంస్థలు అధికంగా లీజింగ్ తీసుకున్నాయి. 27.6 శాతంతో ముందుండగా, ఫ్లెక్సిబుల్ ఆఫీస్ కంపెనీలు 18.5 శాతం, తయారీ-ఇండస్ట్రీ వాటా 13.9 శాతంగా ఉన్నది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆఫీస్ స్పేస్ విషయంలో హైదరాబాద్, బెంగళూరు దూసుకుపోతున్నాయి.