న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ ప్రారంభించిన నెక్సా సర్వీసులను మరిన్ని నగరాలకు విస్తరించినట్లు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా 100 అవుట్లెట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ..తొలి దశలో ఒకేసారి ఆరు సెంటర్లను ప్రారంభించింది.
వీటిలో నిర్మల్(తెలంగాణ), అటేలి, చర్కిదాద్రి(హర్యాన), బంకురా(బెంగాల్), దాహోద్(గుజరాత్), ఊటీ(తమిళనాడు) ఉన్నాయి. 2017లో ప్రారంభమైన నెక్సా సర్వీసులు ప్రస్తుతం 390 టచ్పాయింట్లకు చేరుకున్నాయి.