Starbucks CEO |ఆర్యభట్ట నుంచి మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వరకు అంతర్జాతీయంగా మేధావులకు పెట్టింది పేరుగా భారత్ నిలుస్తుంది. అంతర్జాతీయంగా వివిధ కార్పొరేట్ సంస్థల్లో మేధో సంపత్తితోపాటు వ్యాపార, వాణిజ్య లావాదేవీల్లో తమ నైపుణ్యానికి మెరుగులు దిద్ది.. ఆయా సంస్థల అధినేతలుగా ఎదుగుతున్న భారత సంతతి నిపుణులకు కొదవ లేదు.
ఐటీ జెయింట్స్ మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల, సెర్చింజన్ గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్ వంటి ప్రముఖుల సరసన మరొక ఎన్నారై చేరారు. ఆయన పేరు లక్ష్మణ్ నర్సింహన్..స్టార్బక్స్ సీఈవోగా నియమితులయ్యాక.. ప్రస్తుతం రెకిట్ సీఈవోగా లక్ష్మణ్ నర్సింహన్ రాజీనామా చేశారు.
ప్రపంచ అగ్రశ్రేణి కార్పొరేట్ సంస్థల సీఈవోలుగా సత్యనాదెళ్ల (మైక్రోసాఫ్ట్), శంతను నారాయణ్ (అడోబ్), సుందర్ పిచ్చాయ్ (గూగుల్-అల్ఫాబెట్), పరాగ్ అగర్వాల్ (ట్విట్టర్) భారతీయులే. ఇక పెప్సికో సీఈవోగా 12 ఏండ్ల పాటు పని చేసిన ఇంద్రానూయి 2018లో వైదొలిగారు. పెన్నిసెల్వేనియా యూనివర్సిటీలోని బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ స్కూల్లో సహ విద్యార్థి. ఇలా వివిధ సంస్థలకు సీఈవోలుగా, అధిపతులుగా సారధ్యం వహిస్తున్న భారత సంతతి మేధావుల గురించి తెలుసుకుందాం.. !