న్యూఢిల్లీ : నూతన శ్రేణి ఫీచర్లు, పలు అప్గ్రేడ్స్తో డిస్కవరీ మెట్రపాలిటన్ స్పోర్ట్ ఎడిషన్ను ల్యాండ్ రోవర్ లాంఛ్ చేసింది. డీజిల్, పెట్రోల్ వెర్షన్లో అందుబాటులో ఉండే ఈ ఎస్యూవీ బుకింగ్స్ ప్రారంభం కాగా రూ 1.26 కోట్లకు అందుబాటులో ఉంది.
డిస్కవరీ స్పోర్ట్ మెట్రపాలిటన్ ఎడిసన్లో ఫ్రంట్ ప్యానెల్ను స్లైడింగ్ ఆప్షన్గా మార్చారు. టైటానియం మెష్తో కారు ఇంటీరియర్స్ను ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. 11.4 ఇంచ్ ఇన్ఫోటెయిన్మెంట్ డిస్ప్లే, 12.3 ఇంచ్ ఇనుస్ట్రుమెంట్ ప్యానెల్, వైర్లెస్ చార్జింగ్, మెరిడియన్ సౌండ్ సిస్టంతో డిస్కవరీ స్పోర్ట్ మెట్రొపాలిటన్ ఎడిషన కస్టమర్ల ముందుకొస్తోంది.
దేశీ మార్కెట్లో ల్యాండ్రోవర్ డిస్కవరీ వినూత్న సెవెన్ సీటర్ ఎస్యూవీగా పేరొందగా, మెట్రపాలిటన్ ఎడిషన్ ఇదే విలువతో మరిన్ని పీచర్లను జోడించి నూతన శ్రేణి స్పెసిఫికేషన్స్తో కస్టమర్ల ముందుకొస్తోందని జాగ్వర్ ల్యాండ్ రోవర్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ సూరి పేర్కొన్నారు.