న్యూఢిల్లీ, మే 20: గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను రూ.213.47 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది కరూర్ వైశ్యా బ్యాంక్. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికానికిగాను నమోదైన రూ.104.37 కోట్ల లాభంతో పోలిస్తే రెండు రెట్లు పెరిగింది.
బ్యాంక్ ఆదాయం రూ.1,518.39 కోట్ల నుంచి రూ.1,614.75 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. మరోవైపు, రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు 80 శాతం లేదా రూ.1.60 డివిడెండ్ను బ్యాంక్ బోర్డు సిఫారసు చేసింది.