న్యూఢిల్లీ, నవంబర్ 16: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను సవరించింది. ఏడాది ఎంసీఎల్ఆర్ను 20 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది.
దీంతో ఆటో, గృహ, వ్యక్తిగత రుణాల వంటి కన్జ్యూమర్ లోన్లపై వడ్డీరేటు 8.75 శాతం నుంచి 8.55 శాతానికి దిగొచ్చింది. అయితే మిగతా అన్ని కాలవ్యవధి ఎంసీఎల్ఆర్లను బ్యాంక్ పెంచడం గమనార్హం. ఫలితంగా 15 రోజుల నుంచి మూడేండ్ల వరకు ఎంసీఎల్ఆర్లు 7.8 శాతం నుంచి 9.05 శాతం శ్రేణిలో ఉన్నాయి. నెలనెలా ఎంసీఎల్ఆర్ను కొటక్ సవరిస్తున్నది. ఇక మారిన ఈ వడ్డీరేట్లు వెంటనే అమల్లోకి వస్తాయని బ్యాంక్ తమ వెబ్సైట్లో స్పష్టం చేసింది.