ముంబై, ఏప్రిల్ 29: ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.4,566 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,767 కోట్ల లాభంతో పోలిస్తే 14.29 శాతం వృద్ధి కనబరిచింది. గత త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం రూ.4,521 కోట్ల నుంచి రూ.6,103 కోట్లకు పెరగడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.