నగరంలో తొలి విడతగా కాల్వొడ్డు టూ కొత్త బస్టాండ్
ఎక్కడి నుంచైనా రూ.10
ఖమ్మం, ఏప్రిల్ 3: ఎప్పుడెప్పుడా అని చూసిన కొత్త బస్టాండ్ ప్రారంభమమైంది. వెంటనే లోకల్ బస్సుల రవాణా సైతం మొదలైంది. ఇంకేముంది నగరంలో ట్రాఫిక్ తగ్గడంతోపాటు తక్కువ ధరలకే లోకల్ ప్రయాణం చేసేందుకు అవకాశం ఏర్పడింది. నగరంలో నూతన బస్టాండ్ ప్రారంభోత్సవం జరిగిన మరుసటి రోజునే ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా ఆర్టీసీ సంస్థ చర్యలు చేపట్టింది. తొలి విడతగా కాల్వొడ్డు ప్రాంతం నుంచి కొత్త బస్టాండ్కు, కొత్త బస్టాండ్ నుంచి కాల్వొడ్డుకు బస్సుల రవాణా ప్రారంభమైంది. ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఇందుకు గాను ఏ స్టేజీ నుంచి ఏ స్టేజీకి ప్రయాణం చేసినా రూ.10 చార్జీ తీసుకుంటున్నట్లు చెప్పారు. కాల్వొడ్డు నుంచి బయలు దేరిన బస్సు పాత బస్టాండ్, చేపల మార్కెట్, జడ్పీ సెంటర్ మీదుగా ఐటీ హబ్, ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్, ఎన్టీఆర్ సర్కిల్, ఆర్టీఓ ఆఫీస్ నుంచి నూతన బస్టాండ్కు చేరుకుంటుందని వివరించారు. న్యూ బస్టాండ్ నుంచి కాల్వొడ్డు రూట్లో ఎగువ, దిగువ మార్గాల్లో బస్సులు నడుస్తున్నట్లు చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బసులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.
ఇవి కూడా చూడండి..
సచిన్ వాజే ఎన్ఐఏ కస్టడీ ఈ నెల 7 వరకు పొడిగింపు
డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతే ఈ అలారం మోగుతుంది.. సిద్ధం చేసిన మిలటరీ