హైదరాబాద్, ఆగస్టు 7: కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లిమిటెడ్(కిమ్స్) అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.609 కోట్ల ఆదాయంపై పన్నులు చెల్లించిన తర్వాత రూ.87 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం నమోదైన ఆదాయంతో పోలిస్తే 21.6 శాతం, నికర లాభంలో 9.3 శాతం పెరుగుదల కనిపించింది. ఈ సందర్భంగా కంపెనీ సీఎండీ బీ భాస్కర్ రావు మాట్లాడుతూ..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రికార్డు స్థాయి లాభాలతో ప్రారంభించినట్లు చెప్పారు. ప్రస్తుతం కంపెనీ వద్ద రూ.178 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. కంపెనీ షేరు ధర స్వల్పంగా పెరిగి రూ.1,856 వద్ద ముగిసింది.