హైదరాబాద్, జూన్ 29 : రాష్ర్టానికి చెందిన ప్రముఖ హెల్త్కేర్ సంస్థ కృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(కిమ్స్) మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నది. అమెరికన్ అక్రెడిటేషన్ కమిషన్ ఇంటర్నేషనల్(ఏఏసీఐ) నుంచి ఏఏసీఐ మల్టీ-సైట్ అక్రెడిటేషన్ పొందిన ప్రపంచంలోనే తొలి హెల్త్కేర్ నెట్వర్క్గా కిమ్స్ హాస్పిటల్ నిలిచింది. అమెరికన్ అక్రెడిటేషన్ పొందిన ప్రపంచంలోనే తొలి హెల్త్కేర్ సంస్థ కిమ్స్ కావడం విశేషం. ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు, కిమ్స్ హాస్పిటల్స్ తను ఏడు ఆసుపత్రుల్లో ఒకే నాణ్యత ప్రమాణాలు, రోగి భద్రత, క్లినికల్ అత్యుత్తమ పరిపాలన, నిరంతర పర్యవేక్షణ అంతర్జాతీయ స్థాయిలో ధృవీకరించినట్టు అయింది.
ఈ సందర్భంగా కిమ్స్ సీఎండీ భాస్కర్ రావు మాట్లాడుతూ.. మూడు సంవత్సరాల క్రితం మా ఆసుపత్రుల్లో ఒక యూనిట్నకు ఏఏసీఐ అక్రెడిటేషన్ లభించింది. ఈ గుర్తింపు తమ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, పరిపాలనా సిబ్బంది, నాణ్యతా బృందాలు, నాయకత్వం సమిష్టిగా చేసిన కృషికి నిదర్శనమన్నారు. ఇదే నాణ్యత వ్యవస్థను విస్తరించి విజయవంతంగా అమలు చేయడం జరిగింది. ప్రామాణిక క్లినికల్ ప్రొటోకాల్స్, పటిష్టమైన పాలనా వ్యవస్థలు, శాస్త్రీయ ఆధారాలతో కూడిన వైద్య విధానాలు, నిరంతర నాణ్యతా ప్రమాణాలతో కిమ్స్ హాస్పిటల్స్ సేవలను ఒకే ప్రమాణాలతో అందించగలమని మరోసారి నిరూపించకున్నామని చెప్పారు.