న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశీయ మార్కెట్లోకి ఓ సరికొత్త కారును విడుదల చేసినట్లు బుధవారం కియా ప్రకటించింది. మధ్య శ్రేణి ఎస్యూవీ సెల్టోస్లో ఎక్స్ లైన్ ట్రిమ్ మోడల్ను పరిచయం చేశామన్నది. ఎక్స్షోరూం ప్రకారం పెట్రోల్ వేరియంట్ ధర రూ.17.79 లక్షలు. డీజిల్ వేరియంట్ రూ.18.10 లక్షలుగా ఉన్నది. ఈ కారుకు 18 అంగుళాల క్రిస్టల్ కట్ అల్లాయ్ వీల్స్ తదితర ఫీచర్లున్నాయి.