Kia Motors | భారత్లో కార్యకలాపాలు ప్రారంభించిన మూడేండ్లలోనే దక్షిణకొరియా ఆటో మేకర్ కియా మోటార్స్.. ఐదు లక్షలకు పైగా కార్లు విక్రయించింది. కరెన్స్కు భారీ గిరాకీ ఏర్పడటంతో గత నాలుగున్నర నెలల్లో ఇన్వెస్టర్లు లక్ష కార్లు కొనుగోలు చేశారు. విదేశాలకు ఎగుమతితోపాటు మొత్తం కియా ఇండియా కార్ల విక్రయాలు 6,34,224 యూనిట్లకు చేరాయి. భారత్లో విక్రయాలతో అంతర్జాతీయంగా కార్ల సేల్స్లో కియా మోటార్స్ ఆరు శాతానికి పైగా మార్కెట్ సాధించింది.
భారత్లో అతి తక్కువ కాలంలో మూడేండ్లలోపే నూతన టెక్నాలజీ దత్తతతో ట్రెండ్స్లో లీడింగ్, బ్రాండ్లో స్ఫూర్తిదాయక ప్రగతి సాధించామని కియా మోటార్స్ ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ మ్యుంగ్ సిక్ సోన్ తెలిపారు. భారత్ ఇక ముందు కూడా తమకు ప్రియారిటీ మార్కెట్ అని పేర్కొన్నారు. భారత్తోపాటు వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు చెప్పారు.
మిడ్సైజ్డ్ ఎస్యూవీ క్యాటగిరీలో సెల్టోస్ మోడల్ కార్ల విక్రయాలు.. కియా మోటార్స్ మొత్తం సేల్స్లో టాప్లో నిలిచాయి. కియా మోటార్స్ సేల్స్లో సెల్టోస్ వాటా 59 శాతం కాగా, సొనెట్ 32 శాతం పై చిలుకు విక్రయాలు ఉన్నాయి. తర్వాతీ దశలో కరెన్స్లో 6.5 శాతానికి చేరువలో ఉన్నాయి. ఎస్యూవీ సెగ్మెంట్లో సొనెట్ 15 శాతం, మిడ్ ఎస్యూవీ క్యాటగిరీలో సెల్టోస్ 40 శాతానికి పైగా వాటా కలిగి ఉన్నాయి. వీటితోపాటు కరెన్స్, కార్నివాల్ సేల్స్లో రికార్డులు నమోదవుతున్నాయి.