Kia EV6 Launched | దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ దేశీయ మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ కారు `ఈవీ6` ప్రవేశపెట్టింది. రెండు ట్రిమ్ వర్షన్లు.. జీటీ లైన్ ఆర్డబ్ల్యూడీ, జీటీ లైన్ ఏడబ్ల్యూడీల్లో గురువారం ఆవిష్కరించింది. కారు ధర రూ.59.95 లక్షల నుంచి మొదలవుతుంది. జీటీ లైన్ ఏడబ్ల్యూడీ వర్షన్ కారు ధర రూ.64.95 లక్షలుగా ఖరారు చేసింది. గత నెల 26న కియా `ఈవీ6` కార్ల బుకింగ్ మొదలైంది. దేశవ్యాప్తంగా 12 నగరాల్లో ఎంపిక చేసిన 15 డీలర్షిప్ల వద్ద రూ.3 లక్షలు కట్టి టోకెన్ తీసుకుంటే కారు బుక్ చేసుకున్నట్లే. ఈ నేపథ్యంలో ఇప్పటికే 100 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 528 కి.మీ. దూరం ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం. ఇప్పటివరకు కియా ఈవీ6 కార్లు 355 ప్రీబుకింగ్స్ జరిగాయి. సెప్టెంబర్ నుంచి కొత్తగా బుకింగ్స్ నమోదవుతాయని కియా మోటార్స్ తెలిపింది.
77.4 కిలోవాట్ల-ఆర్ బ్యాటరీ ప్యాక్తో ఒక్కసారి చార్జీ చేస్తే 528 కి.మీ. దూరం ప్రయాణిస్తుందీ కియా ఈవీ6. 321 బీహెచ్పీ పవర్ 605 ఎన్ఎం టార్చి ఆవిష్కరిస్తుందిది. వినియోగదారులకు 58కిలోవాట్ల – ఆర్ బ్యాటరీ ప్యాక్ కూడా అందుబాటులో ఉంది.
ఆర్డబ్ల్యూడీ వర్షన్లో కియా ఈవీ6 సింగిల్ మోటార్ కలిగి ఉంటుంది. 226 బీహెచ్పీ పవర్, 350 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఏడబ్ల్యూడీ వర్షన్ కారు డ్యుయల్ మోటార్ సెటప్ ఉంటుంది. రెండు ఇంజిన్లు 320 బీహెచ్పీ పవర్, 650 ఎన్ఎం టార్చి ఉత్పత్తి చేస్తాయి. రెండు వర్షన్లకు 77.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది. ఆర్డబ్ల్యూడీ ట్రిమ్ వర్షన్ కారు సింగిల్ చార్జీ అయితే 528 కి.మీ., ఏడబ్ల్యూడీ వర్షన్ కారు 425 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది.