ప్రారంభ ధర రూ.8.99 లక్షలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ప్రముఖ వాహన ఉత్పత్తి సంస్థ కియా..దేశీయ మార్కెట్లోకి నాలుగో మోడలైన ‘కరెన్స్ను’ పరిచయం చేసింది. ఈ కారు పరిచయ ధరను రూ.8.99 లక్షలు మొదలుకొని రూ.16.99 లక్షల గరిష్ఠ ధరను నిర్ణయించింది. ఆరు, ఏడుగురు కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసిన ఈ కారు..మారుతికి చెందిన ఎక్స్ఎల్6, హ్యుందాయ్ అల్కాజర్, మహీంద్రా ఎక్స్యూవీ 700, టాటా మోటర్స్ సఫారీలకు పోటీగా అందుబాటులోకి తీసుకొచ్చింది. కియా ఇప్పటికే దేశీయంగా సెల్టాస్, సోనెట్, కార్నివాల్లను విక్రయిస్తున్నది. నూతనంగా ప్రవేశపెట్టిన కరెన్స్..1.5 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్తో రూపొందించింది. వీటిలో పెట్రోల్ వెర్షన్ రూ.8.99 లక్షల నుంచి రూ.16.99 లక్షల మధ్యలో లభించనుండగా..డీజిల్ వెర్షన్ రూ.10.99 లక్షల నుంచి రూ.16.99 లక్షల మధ్యలో లభించనున్నది. లీటర్ పెట్రోల్కు 16.5 కిలోమీటర్లు, డీజిల్ రకం 21.3 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. గత నెలలో ముందస్తు బుకింగ్ ఆరంభించిన ఈ మోడల్కు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభించిందని, ఇప్పటి వరకు 19 వేలకి పైగా బుకింగ్లు వచ్చాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.