న్యూఢిల్లీ, జూన్ 30: కీలక రంగాలు అంచనాలకుమించి వృద్ధి కనబరిచాయి. మే నెలలో కీలక రంగాల్లో వృద్ధి 18.1 శాతంగా నమోదైంది. ఏడాది క్రితం ఇదే నెలలో నమోదైన 16.4 శాతంతో పోలిస్తే అధిక వృద్ధి ఇదేనని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది. ఏప్రిల్ నెలలో నమోదైన 9.3 శాతంతో పోలిస్తే ఇంచుమించు రెండు రెట్లు పెరిగింది. మే నెలకుగాను బొగ్గు 25.1 శాతం, క్రూడాయిల్ 4.6 శాతం, రిఫైనరీ ఉత్పత్తులు 16.7 శాతం, ఎరువులు 22.8 శాతం, సిమెంట్ 26.3 శాతం, విద్యుత్ 22 శాతం వృద్ధిని కనబర్చడం వల్లనే కీలక రంగాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని తెలిపింది. కానీ, సహజ వాయువు 7 శాతం తగ్గగా, స్టీల్ 15 శాతం చొప్పున పడిపోయాయి.