టోక్యో : కవాసకి మోటార్స్ 2025 నుంచి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీపై పూర్తిస్ధాయిలో దృష్టి కేంద్రీకరించనుంది. 2035 నాటికి పూర్తిస్ధాయిలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ చేపడుతుందని కవాసకి మోటార్స్ ప్రెసిండెంట్ హిరోషి ఇటో వెల్లడించారు. కంపెనీ న్యూ లోగోను కూడా ఆవిష్కరించింది. ఇక నూతన సవాళ్లను వినూత్న ఆవిష్కరణలతో ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతామని హిరోషి ఇటో ఈ సందర్భంగా పేర్కొన్నారు.
2025 నాటికి ఏటా 16 నూతన ద్విచక్రవాహనాల మోడల్స్ను ప్రవేశపెట్టేందుకు కవాసకి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇక 2025 నాటికి ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల్లో ఏటా పది న్యూ మోడల్స్ను ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమైంది. దీనికోసం కంపెనీ భారీ ఎత్తున పెట్టుబడులను వెచ్చించడంతో పాటు డిజిటల్ ట్విన్ సిములేషన్ టెక్నాలజీ వాడకాన్ని వేగవంతం చేయనుంది.