హైదరాబాద్: బ్యాంకులకు రుణాల ఎగవేతకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న కార్వీ ఎండీ పార్ధసారధి కేసు శుక్రవారం మరో మలుపు తిరిగింది. ఆ సంస్థ కార్యదర్శిగా పని చేస్తున్న శైలజను శుక్రవారం హైదరాబాద్ సెంట్రల్ సైబర్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తున్నది. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య నలుగురికి చేరింది.
ఇదే కేసులో ఇద్దరు నిందితులను గురువారం సెంట్రల్ సైబర్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారిలో ఒకరు సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజీవ్ రంజన్ సింగ్, మరొకరు చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ కృష్ణహరి ఉన్నారు. వీరిద్దరు నకిలీ షెల్ కంపెనీలతో మోసాలకు పాల్పడ్డారని సీసీఎస్ పోలీసులు నిర్ధారించారు.
కార్వీ ఎండీ పార్థసారథి సూచన మేరకే నిందితులు రాజీవ్ రంజన్ సింగ్, కృష్ణహరి నకిలీ షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారు. కాగా, నిందితులిద్దరు 2014 నుంచి షెల్ కంపెనీలను నడుపుతున్నారని సీసీఎస్ పోలీసులు చెప్పారు. ఇప్పటి వరకు పార్థసారథిపై సీసీఎస్ పోలీసులు 4 కేసులను నమోదు చేశారు.