కమాన్చౌరస్తా, మే 23 : కరీంనగర్ ఫిలిగ్రీకి ప్రత్యేక గౌరవం దక్కింది. ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ, నీతా దంపతుల కొడుకు అనంత్ అంబానీ వివాహం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న చేనేత హస్తకళా రూపాలను దేశ విదేశాలకు చెందిన అతిథులకు బహుమతులుగా ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో కరీంనగర్ ఫిలిగ్రీకి దాదాపు 400 వస్తువుల కోసం ఆర్డర్ చేసినట్లు కరీంనగర్ ఫిలిగ్రీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఎర్రోజు అశోక్, కార్యదర్శి గద్దె అశోక్ కుమార్ తెలిపారు. ఇందులో జ్యువెలరీ బాక్సులు, పర్సులు, ట్రేలు, ఫ్రూట్ బౌల్స్, తదితరులు ఉన్నట్లు చెప్పారు.