నేడు కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్లో ప్రారంభం
హైదరాబాద్, ఏప్రిల్ 23: రాష్ట్రంలో మరో 3 షోరూంలను ప్రారంభిస్తున్నట్లు ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జ్యుయెల్లర్స్ శుక్రవారం ప్రకటించింది. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్లలో వీటిని తీసుకువస్తున్నామని తెలిపింది. కరీంనగర్, ఖమ్మంలలో సంస్థకు ఇవే తొలి షోరూంలు కావడం విశేషం. కాగా, శనివారం ఉదయం 9:30 గంటలకు కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ టీఎస్ కళ్యాణరామన్ ఈ షోరూంలను ఆవిష్కరించనున్నారు. కరోనా నేపథ్యంలో వర్చువల్ పద్ధతిలో వీటిని ప్రారంభిస్తారు. కరీంనగర్లో బస్టాండ్ రోడ్డు వద్ద, ఖమ్మంలో వైరా రోడ్డు వద్ద షోరూంలు తెరుచుకుంటున్నాయి. ఈ సందర్భంగా కొనుగోలుదారులకు బంగారం ఆభరణాల వీఏపై 50 శాతం వరకు రాయితీ లభించనున్నది. వజ్రాభరణాల విలువపై 25 శాతం రాయితీ ఉంటుంది. అలాగే అన్కట్, ప్రీషియస్ స్టోన్ జ్యుయెల్లరీ కొనుగోలుపై 20 శాతం రాయితీ లభిస్తుంది. మేకింగ్ చార్జీలు 3 శాతం నుంచి మొదలుకానున్నాయి. కాగా, పాత బంగారు నగలపై 0% తగ్గింపుతో అత్యధిక విలువను అందిస్తామని సంస్థ తెలియజేసింది. ఈ ఆఫర్ మే 30 వరకు అందుబాటులో ఉండనున్నది.