హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) చైర్మన్గా కే ప్రతాప్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు చైర్మన్గా ఉన్న ప్రవీణ్కుమార్ నుంచి ప్రతాప్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈ పదవిలో ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. రెండు దశాబ్దాలకు పైగా ఎస్బీఐలో విధులు నిర్వహించిన ప్రతాప్ రెడ్డికి దేశీయ, విదేశీ అసైన్మెంట్లలో విస్తృతమైన నైపుణ్యం కలిగి ఉన్నారు.