న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఎలక్ట్రానిక్ వాహన విభాగంలోకి మరో వ్యాపార దిగ్గజం ప్రవేశించబోతున్నది. దేశవ్యాప్తంగా ఈవీ వాహన మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి జేఎస్డబ్ల్యూ ప్రణాళికలను రచిస్తున్నది. ఇందుకోసం ఎంజీ మోటర్ ఇండియాతో సంప్రదింపులు జరుపుతున్నది. ఈ విషయాన్ని జేఎస్డబ్ల్యూ గ్రూపు చైర్మన్ సజ్జన్ జిందాల్ వెల్లడించారు.
ఎంజీ మోటర్తో జరుపుతున్న చర్చలు కొనసాగుతున్నాయని, ఈవీల విభాగంలోకి ప్రవేశించడం ఖాయమన్నారు. ఒకవేళ ఎంజీ మోటర్తో జరుపుతున్న చర్చలు కొలిక్కిరాకపోతే సొంతంగానే ఈవీలను అభివృద్ధి పరచనున్నట్లు బీ20 సమ్మిట్ ఇండియా 2023 సదస్సులో ఆయన చెప్పారు. ఎలక్ట్రిక్ నాలుగు చక్రాల వాహనాలను తయారు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే జేఎస్డబ్ల్యూ గ్రూపు..స్టీల్, ఎనర్జీ, ఇన్ఫ్రా, సిమెంట్, పెయింట్స్, వెంచర్ క్యాపిటల్, స్పోర్ట్స్ విభాగాల్లో సేవలు అందిస్తున్నది.