JSW MG | ముంబై, మార్చి 20: చైనాకు చెందిన అతిపెద్ద వాహన సంస్థ ఎస్ఏఐసీ మోటర్తో జేఎస్డబ్ల్యూ గ్రూపు జతకట్టింది. ఇరు సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా భారత్లో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. ప్రతి మూడు నుంచి ఆరు నెలలకొక సరికొత్త ఈవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంస్థ..ఇందుకోసం గుజరాత్లో రూ.5 వేల కోట్ల పెట్టుబడితో రెండో ప్లాంట్ను నెలకొల్పబోతున్నట్లు జేఎస్డబ్ల్యూ గ్రూపు చైర్మన్ సజ్జన్ జిందాల్ తెలిపారు.
జాయింట్ వెంచర్లో ఏర్పాటైన సంస్థలోజేఎస్డబ్ల్యూకి 35 శాతం వాటా ఉండగా, ఇండియన్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్కు 8 శాతం, ఎంజీ మోటర్కు 3 శాతం ఉద్యోగులకు ఉండగా, మిగతా 49 శాతం వాటా ఎస్ఏఐసీ ఉన్నది. 2030 నాటికి దేశవ్యాప్తంగా ప్రతియేటా కోటి వాహనాలు అమ్ముడవుతాయని అంచనావేస్తున్న సంస్థ..వీటిలో పది లక్షల యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నది సంస్థ. రెండో ప్లాంట్ అందుబాటులోకి వస్తే కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం లక్ష యూనిట్ల నుంచి 3 లక్షల యూనిట్లకు పెరగనున్నది. 2023లో ఎంజీ మోటర్ దేశంలో 60 వేల యూనిట్ల వాహనాలను విక్రయించింది.