హైదరాబాద్, జూలై 17: జోయాలుక్కాస్ అతిపెద్ద కలెక్షన్తో బ్యాంగిల్ ఫెస్టివల్ను ప్రారంభించింది. నిపుణులు కళాత్మకంగా తయారు చేసిన ఈ 2021 ఎడిషన్లో ఇంతవరకూ చూడని డిజైన్లు ఉన్నాయని, పలు ఆఫర్లు కూడా ఉన్నాయని జోయాలుక్కాస్ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. మజూరీ చార్జీలపై 30 శాతం వరకూ ఆదా పొందవచ్చని కంపెనీ పేర్కొంది.
డిజైన్లను అన్వేషించడానికి, కొత్త పోకడల్ని సృష్టించడానికి లాక్డౌన్ సమయం తమకు కావాల్సినంత సమయాన్ని ఇచ్చిందని జోయాలుక్కాస్ గ్రూప్ ఛైర్మన్, ఎండీ జాయ్ అలుక్కాస్ చెప్పారు. బ్యాంగిల్ ఫెస్ట్లో వేద నుంచి టెంపుల్ డిజైన్ కలెక్షన్, రత్నా నుంచి హెరిటేజ్ కలెక్షన్, జెనినా నుంచి టర్కిష్ డిజైన్లు, అపూర్వ నుంచి ఎథ్నో డిజైన్లు లభిస్తాయని ఆయన తెలిపారు.