Jio | తాజాగా ప్రకటించిన ప్లాన్పై రిలయన్స్ జియో 24 గంటల్లోనే యూ-టర్న్ తీసుకున్నది. కేవలం రూపాయికే 30 రోజులపాటు 100ఎంబీ డేటా ఇస్తామని బుధవారం ప్రకటించింది. కానీ గురువారం జియో మాట మార్చింది. రూపాయి రీ చార్జి ప్లాన్ ఒక్కరోజుకు మాత్రమేనని అదీకూడా కేవలం 10ఎంబీ డేటా మాత్రమే పొందొచ్చని తెలిపింది. బుధవారం చేసిన ప్రకటన ప్రకారం రూపాయిపై 30 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉండటంతోపాటు 100 ఎంబీ డేటా పొందొచ్చు.
కానీ సవరణ ప్రకారం ఆ ప్లాన్కు ఒక్కరోజుకు.. డేటా ప్లాన్ను భారీగా తగ్గించేసింది. తాజాగా ప్రకటించిన ప్లాన్నూ ఇతర ప్లాన్లతోపాటు ప్యాక్ వాల్యూ సెషన్లో లిస్ట్ చేసింది. ఈ మేరకు పాత ప్రకటనపైనా, తాజా ప్రకటనసైనా స్క్రీన్షాట్లను జియో షేర్ చేసుకుంది. రిలయన్స్ జియో తీసుకున్న ఈ నిర్ణయం యూజర్లను ఆశ్చర్యచకితులని చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో 100 ఎంబీ డేటా పొందాలంటే 10 సార్లు రీచార్జీ చేయాల్సి ఉంటుంది. దీని వ్యాలిడిటీ కేవలం 10 రోజులే ఉంటుంది.