JioPhone Prima 4G | రిలయన్స్ జియో తన యూజర్ల కోసం మరో కొత్త ఫోన్ ‘జియో ఫోన్ ప్రైమా 4జీ’ ఆవిష్కరించింది. ఈ మేరకు ఇండియన్ మొబైల్ కాంగ్రెస్-2023 (ఐఎంసీ)లో ప్రదర్శించింది. దీపావళి పండుగ నుంచి కస్టమర్లకు అందుబాటులో వస్తుందని తెలిపింది. వాట్సాప్, యూ-ట్యూబ్ సహా సోషల్ మీడియా యాప్స్తోపాటు ప్రీమియం డిజైన్ తో వస్తున్నది. జియో ఫోన్ ప్రైమా 4జీ ఒక ఫీచర్ ఫోన్. రూ.2,599లకే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
జియో ఫోన్ ప్రైమా 4జ ఫోన్ 2.4 అంగుళాల టీఎఫ్టీ డిస్ ప్లే విత్ 320×240 పిక్సెల్స్ రిజొల్యూషన్ తో వస్తున్నది. 0.3 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతోపాటు ఫ్లాష్ లైట్, కెమెరా ఉంటాయి.
512 ఎంబీ ర్యామ్తో వస్తున్న ఈ షోన్ మైక్రో ఎస్డీ కార్డు సాయంతో 128 జీబీ వరకూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు. కాయి ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్పై పని చేస్తుందీ ఫోన్. ఏఆర్ఎం కార్టెక్స్ ఏ53 ప్రాసెసర్ కలిగి ఉంటుంది.
జియో ఫోన్ ప్రైమా 4జీ ఫోన్ బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ కలిగి ఉంటది. 1800 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. ఎఫ్ఎం రేడియో కూడా ఉంటుంది. యూ-ట్యూబ్, జియో టీవీ, జియో సినిమా, జియో సావన్, జియో న్యూస్ తదితర యాప్స్ ఉంటాయి.